Last Updated:

Assam CM : మీరు గడ్డం గీసుకుంటే నెహ్రూలా కనిపిస్తారు.. రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సెటైర్లు

రాహుల్ గాంధీ తన గడ్డం గీసుకుంటే భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలా కనిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

Assam CM : మీరు గడ్డం గీసుకుంటే నెహ్రూలా కనిపిస్తారు.. రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సెటైర్లు

Assam CM: రాహుల్ గాంధీ తన గడ్డం గీసుకుంటే భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలా కనిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.కొద్దిరోజులకిందట రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్ లా కపపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.నేను అతని (రాహుల్ గాంధీ) లుక్ గురించి ఏమీ చెప్పలేదు. నేను ఇప్పుడే చెప్పాను, మీ ముఖం సద్దాం హుస్సేన్ లాగా కనిపించడం ప్రారంభించింది, కానీ మీరు మీ గడ్డం గీస్తే మీరు నెహ్రూలా కనిపించడం ప్రారంభిస్తారు. నన్ను ట్రోల్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ వారే రాహుల్ గాంధీ గడ్డాన్ని సద్దాం హుస్సేన్‌తో పోల్చారని ఆయన అన్నారు.

వారంరోజులకిందట అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధఈ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నారు.అతని రూపురేఖలు కూడా మారినట్లు నేను ఇప్పుడే చూశాను. తన కొత్త లుక్‌లో ఎలాంటి తప్పు లేదని కొద్దిరోజుల క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. అయితే రూపురేఖలు మార్చుకోవాల్సి వస్తే కనీసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌లా లేదా జవహర్‌లాల్ నెహ్రూ లాగా అయినా చేయండి. గాంధీజీలా కనిపిస్తే మంచిది. కానీ మీ ముఖం ఎందుకు సద్దాం హుస్సేన్‌గా మారుతోంది?” దీనికి కారణం కాంగ్రెస్ సంస్కృతి . అది భారతీయ ప్రజలకు దగ్గరగా లేదు. వారి సంస్కృతి భారతదేశాన్ని ఎన్నడూ అర్థం చేసుకోని వ్యక్తులకు దగ్గరగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ఒక ట్వీట్‌లో రాహుల్ గాంధీ గడ్డంపై అస్సాం సీఎం చేసిన అసహ్యకరమైన మరియు పూర్తిగా ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలపై అనేక టీవీ ఛానెల్‌లు ఈ రోజు చర్చలు జరపడం నిజంగా దయనీయంగా ఉంది. ఇది భారత్ జోడో యాత్రను చిన్నచూపు చూస్తుంది.ఈ ఛానెళ్లు తమను తాము కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని అన్నారు.

ఇవి కూడా చదవండి: