Home / తప్పక చదవాలి
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.
మణిపూర్లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో కూడిన అంబులెన్స్ను ఒక గుంపు దారిలో పెట్టి తగలబెట్టడంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు అతని తల్లి మరియు మరొక బంధువుతో సహా మరణించాడని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 3.5 శాతంగా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
ఫోన్ హ్యాకింగ్కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.
విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది.
అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేయాలని కేబినేట్ నిర్ణయించింది.
వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.