Home / అంతర్జాతీయం
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
అమెరికాలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. ఏదో చిన్నా చితకా కంపెనీ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అయితే అందరి ఫోకస్ ఆ కంపెనీపై ఉంటుంది. తాజాగా అల్ఫాబెట్ మాతృసంస్థ గూగుల్ విచక్షణా రహితంగా ఉద్యోగులపై వేటు వేస్తూ పోతోంది. కంపెనీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎడాపెడా కోత విధిస్తోంది.
కెనడాలో సిక్కుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే సిక్కుల మద్దతు తప్పనిసరి. అయితే ఆదివారం టోరంటోలో ఖల్సా డే సంబరాలు జరిగాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్కు అనుకూలంగా.. అలాగే ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రేకు మద్దతుగా నినాదాలు చేశారు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ఎర్ర సముద్రం ద్వారా వచ్చే నౌకలను హౌతీ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఇజ్రాయెల్ - గాజా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హౌతీలు గాజాకు మద్దతు తెలుపుతూ ఈ రూట్లలో వెళ్లి నౌకలను హైజాక్ చేయడం.. వాటిని విడిపించేందుకు బేరసారాలు చేస్తూ డబ్బు దండుకుంటున్నారు.
ఖరీదైన హోటళ్ల లో ఖరీదైన భోజనం పీకలదాకా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయే బాపతు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. తాజాగా బ్రిటన్లో ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక జంట ఐదు రెస్టారెంట్లలో ఖరీదైన భోజనం తిని సుమారు వెయ్యి పౌండ్లు వరకు చెల్లించకుండా పారిపోయింది.
తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది.
బుర్కినా ఫాసోలో మిలిటరీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు గ్రామాల్లో సుమారు 223 మందని దారుణంగా చంపారని మానవ హక్కు గ్రూపు తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సామూహిక హత్యలు ఫిబ్రవరి 25 నోన్డిన్, సోరో గ్రామాల్లో జరిగాయని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్ టెస్ట్లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్ యుసుఫ్జాయ్ చెప్పారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.