Home / తాజా వార్తలు
Paisawala: రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’. ఈ సినిమాకి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేశారు. ‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని శ్రీలీల అన్నారు. ఈ సినిమా ఘన […]
Telangana: రాష్ట్రంలో జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పాఠశాలలు రీఓపెన్ చేసిన జూన్ 12 రోజునే పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని అనుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, చదువుపై అందరికీ అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. బడిబాటకు సంబంధించి జూన్ 6న గ్రామసభలు నిర్వహించాలని సూచించింది. కాగా గ్రామసభలు, బడిబాట కార్యక్రమంలో […]
Miss World Contestants: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపటేషన్స్ జరుగుతున్నాయి. కాగా 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మే 10 నుంచి పోటీలు ప్రారంభమవగా.. మే 30న ఫైనల్ జరగనుంది. కాగా ఈ పోటీలకు 109 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ కు చేరుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు, అతిథులు నగరానికి విచ్చేశారు. వీరికి ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. […]
Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది. […]
Pakistan: పాకిస్తాన్ లో ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి రేడియేషన్ రావడం లేదని, ఎలాంటి లీకేజీ లేదని చెప్పింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 […]
HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఈ కేసుపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. కంచ గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వ అధికారులను మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. మొక్కలు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు. అధికారులు సమర్ధించుకునే ప్రయత్నం చేయొద్దని […]
Bellamkonda Sai Srinivas Breaks Traffic Rules: టాలీవుడ్ హీరో, అగ్ర నిర్మాత కొడుకు ట్రాఫిక్ రూల్స్ అధిగమించి పోలీసులకు చిక్కాడు. అది గమించిన కానిస్టేబుల్ వారించడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఆ తెలుగు హీరో ఎవరా అనుకుంటున్నారా? బెల్లకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడే బెల్లికొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో వెండితెరపై కనిపించ చాలా కాలం […]
Bellamkonda Sreenivas: ఎంత సెలబ్రిటీలు అయినా వారు మనుషులే. వాళ్లు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్లు మద్యం తాగుటూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. యాక్సిడెంట్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఒక చిన్న తప్పు చేసి ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు. సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అందుకే కొందరు త్వరగా వెళ్లాలని రాంగ్ […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]