Home / ప్రాంతీయం
Nara Lokesh Released AP Tenth Results 2025: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఉదయం 10 గంటలకు పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అనంతరం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in లేదా http://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీంతో పాటు మన మిత్ర వాట్సప్, లీప్ యాప్లో సైతం ఫలితాలను చెక చేసుకునేలా […]
TDP Leader murder : ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గురయ్యారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో వీరయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత […]
BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రజతోత్సవ […]
Andhra Pradesh News : ఈ రోజుల్లో కొందరు స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే.. ఇవేం చదువులు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు భయపడేవారు. టీచర్లు అంటే గౌరవం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్గా ఉంది. ఉపాధ్యాయులపై జోకులు వేయడం వంటివి చేస్తున్నారు. క్లాస్ రూమ్లో విద్యార్థులను టీచర్లు కొడితే.. తల్లిదండ్రులు మా అబ్బాయిని కొడతారా..? మా అమ్మాయిని బెరిస్తారా? అంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలిపై […]
Summer special trains : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 24 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టూర్లకు వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల దృష్ట్యా అదనపు రైళ్లను నడుపనున్నది. తాజాగా విశాఖ- తిరుపతి, భువనేశ్వర్-యశ్వంత్పూర్ మధ్య రైళ్లు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ-తిరుపతి రైలు నంబర్ 08583 […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన 6 మంది మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బండ రాళ్లను తొలగించారు. లోకో రైలు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాల వెలికితీత నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్లను బయటికి […]
Film Awards : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు వేదిక ఖరారు అయింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తున్నది. అవార్డుల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ చైర్మన్గా ప్రముఖ నటి జయసుధతోపాటుగా 15 మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్రాజు, జయసుధ […]
CRPF Big Operation Against Maoist in Karreguttalu: తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పుల మోత జరిగింది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఛత్తీస్గఢ్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల మోతకు భయపడి కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోయారు. కాగా, ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు వేలసంఖ్యలో ఛత్తీస్గఢ్ చేరుకున్నాయి. అయితే శాంతి చర్చలు అంటూనే ఎన్ కౌంటర్లు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని ప్రొఫెసర్ హరగోపాల్ […]
Heat Wave in Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. పలు చోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కావున అనవసరంగా ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని […]
AP IPS Officer PSR Anjaneyulu Arrested: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ […]