Home / సినిమా వార్తలు
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో సంక్రాంతికి విడుదలయిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్లలో దూసుకుపోతోంది. కేవలం విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదవ స్దానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2 టీజర్ నేడు రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే టీజర్ వైఎస్సార్, జగన్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక అంధుడు తన లాంటి వారెందరో రాజశేఖర్ రెడ్డి కొడుకు వెనుక ఉన్నారంటూ చెప్పిన మాటలతో టీజర్ ప్రారంభమయింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్.ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 76 సింగిల్ స్క్రీన్లలో 70 గుంటూరు కారం కోసం కేటాయించారు.
కేజీఎఫ్ స్టార్ యశ్ ఏడాదిన్నర తరువాత తన తదుపరి చిత్రానికి సిద్దమయ్యాడు. టాక్సిక్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పూర్తిగా గుంటూరు కారం మీద దృష్టి పెట్టారు. మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ త్వరలో తన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్తో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.
2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ బయోపిక్గా యాత్ర చిత్రం విడుదలయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ చిత్రం ఫిబ్రవరి 8, 2024న థియేటర్లలోకి రానుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు . ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ 80 శాతం షూటింగ్ పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిద్దరు రెండేళ్ల కిందటే తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలసిందే. అప్పటి నుంచి ఈ జంట పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.