Home / ఆంధ్రప్రదేశ్
Kiran Kumar Reddy Mocks Rahul Gandhi: రాయచోటిలో ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకూ రాహుల్ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు. ఆటంబాంబు పేలుతుందని అన్నారని, అది ఇప్పుడు తుస్సు మని పోయిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎన్నికల కమిషన్తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెబుతున్నారని, కొంచమైనా తెలివి ఉపయోగించాలి కదా? అని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం […]
Telangana Ministers visit Mangalagiri Jana Sena Party central office: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు జనసేన పార్టీ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈ రోజు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రులు మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ జనసేన పార్టీ […]
AP Deputy CM Pawan Kalyan: గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రహదారుల పనులు పూర్తయితే 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రెండు వారాలకోసారి శాఖాపరంగా సమీక్ష నిర్వహించి, రహదారుల నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను […]
AP Home Minister Anitha: రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు,హోం మంత్రి అనిత పర్యటించారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసి, జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారని చెప్పారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో […]
Tiranga Yatra Under BJP In Andhra Pradesh: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయడం తో పాటు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర […]
YSRCP Leader Botsa Satyanarayana: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. వివేకా హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందన్నారు. మరి ఆ సమయంలో ఎందుకు సీబీఐకి అప్పగించలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని […]
Nandyal MP Byreddy Sabari: పులివెందుల జగన్ అడ్డా కాదని, టీడీపీ కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ అన్నారని, ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ డబ్బును దారి మళ్లించారని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల […]
AP CM Chandrababu Naidu: ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం అల్లూరి జిల్లా లగిశపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం.. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయన్నారు. మంచి మనసు ఉండే […]
APCC President YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలపై చూపిస్తుందని ఆరోపించారు. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. అసలు వైసీపీకి వైఎస్సార్కు ఏం సంబంధం అని నిలదీశారు. మహానేత వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా ఆయన వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి ఒక గొప్ప సీఎం అని గుర్తుచేశారు. […]
Visakha Port Authority: విశాఖ పోర్టు అథారిటీ (ఏపీఏ) మరో అరుదైన ఘనత సాధించింది. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తద్వారా విశాఖపట్నం ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వశాఖ నిర్వహించిన పోటీలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ (ఎస్ఎంపీఏ) రెండో స్థానంలో నిలిచింది. ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) మూడో స్థానంలో నిలిచింది. స్వచ్ఛత, పారిశుధ్య కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన విశాఖ […]