Last Updated:

Vande Bharat Train inauguration: రాజస్థాన్‌లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 12) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జైపూర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది.

Vande Bharat Train inauguration: రాజస్థాన్‌లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat Train inauguration:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 12) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జైపూర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది.

పర్యాటకానికి ఊతమిస్తుంది..(Vande Bharat Train inauguration)

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రాజస్థాన్ తన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ రోజు అజ్మీర్ నుండి ఢిల్లీకి అందిస్తోంది. ఈ రైలు రాజస్థాన్‌లో పర్యాటక రంగానికి ఊతమిస్తుందని అన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో తయారు చేయబడిన మొదటి సెమీ-హైస్పీడ్ రైలు. ఇది అత్యంత కాంపాక్ట్ మరియు సమర్థవంతమైన రైళ్లలో ఒకటి. ఇది భద్రతా వ్యవస్థను కలిగి ఉంది అని ప్రధాని మోదీ తెలిపారు.

శతాబ్దికన్నా గంటముందే..

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క రెగ్యులర్ సర్వీస్ గురువారం (ఏప్రిల్ 13) నుండి ప్రారంభమవుతుంది. ఇది జైపూర్, అల్వార్ మరియు గురుగ్రామ్‌ స్టాప్‌లతో అజ్మీర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్ మరియు అజ్మీర్ ప్రయాణ సమయం 5 గంటల 15 నిమిషాలు. ప్రస్తుతం అదే మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 6 గంటల 15 నిమిషాలు పడుతుంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అదే మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.ఈ రైలు రాజస్థాన్‌లోని పుష్కర్ మరియు అజ్మీర్ షరీఫ్ దర్గాలతో సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఏడాది పొడవునా సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలో జెండా ఊపి ప్రారంభించారు. అదేరోజు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను కూడా ప్రారంభించారు. అంతకుముందు, జనవరిలో, సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య భారతదేశం యొక్క ఎనిమిదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పిఎం మోడీ ప్రారంభించారు. భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన వారం తర్వాత ఈ రైలు ప్రారంభమయింది.