Home / latest national news
Six dead at Mansa Devi Temple in Haridwar Temple: ఉత్తరాఖండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్లోని మాన్సాదేవి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయంలో సుమారు ఉదయం 8:30 గంటల ప్రమాదం జరిగిందని […]
AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతోపాటు జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అమిత్ షాతో సమావేశమై వివిధ అంశాలపై గంటపాటు చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ను కలిశారు. చంద్రబాబుతోపాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిర్మలమ్మను కలిసి ఏపీ […]
UP Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్పై ఉమ్మివేయగా, స్పీకర్ సతీశ్ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుట్కా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. మంగళవారం బడ్జెట్ సమావేశానికి ముందు స్పీకర్ అసెంబ్లీలోకి వస్తున్నాడు. ఈ సమయంలో […]
Granddaughter’s Chat : ఓ బాలిక తెలియకుండా చేసిన తప్పుకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా తన అమ్మమ్మ బ్యాంకు ఖాతాలోని రూ.80 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయుడి సహాయంతో కుటుంబం మోసం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని గురుగ్రామ్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని మాటల మధ్యలో తాము భూమిని అమ్మి వేశామని, రూ.80 లక్షలు వచ్చినట్లు తన స్నేహితురాలికి చెప్పింది. డబ్బులు మొతం తన అమ్మమ్మ బ్యాంకు అకౌంట్లో […]
57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తుంది. అయితే ఇవాళ ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన బద్రీనాథ్ ధామ్లోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బద్రీనాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామ సమీపంలోని ఆర్మీ క్యాంప్ […]
Chhatrapati Shivaji Maharaj’s 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచిన వీరుడిగా, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం స్వప్పించిన దార్శనికుడిగా భరతజాతి మనోఫలకంపై శివాజీ శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ మహాపురుషుని ఉత్తేజకరమైన జ్ఞాపకాలు, సాధించిన విజయాలు, మాతృభూమికై చేసిన త్యాగాలు, పాటించిన ఆదర్శాలు నేటికీ మన భరతజాతికి దీపస్తంభం వలే మార్గదర్శకత్వం వహిస్తూనే […]
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు […]
Kolkata RG Kar Rape and Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్రాయ్కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి […]
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్ను సందర్శించారు. ఆ తర్వాత కువైట్లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. […]
మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావోస్తున్న ఇప్పటికీ సీఎం ఎవరనేది స్పష్టత రాలేదు. దీనిపై మహాయుతి కూటమి తర్జనభర్జన అవుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘మహా’ సీఎం ఎవరూ? అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం కారణంగా ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే చర్చకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ […]