Last Updated:

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ఖర్గే

New Delhi: న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 24 సంవత్సరాలలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం బయటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఖర్గే రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ల స్మారక చిహ్నాలను కూడా సందర్శించి, నాయకులకు నివాళులర్పించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేను సోనియాగాంధీ అభినందించారు. ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడని ఆమె అన్నారు. సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా మల్లికార్జున ఖర్గే ఎదిగారని ఆమె గుర్తు చేశారు. ఖర్గేకు తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ఖర్గేకు బాధ్యతలు అప్పగించడంతో తాను ఉపశమనం పొందినట్టుగా ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేయగల ఏకైక నాయకుడు రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని కాని ఆయన అంగీకరించలేదన్నారు. 22 ఏళ్ల పాటు పార్టీకి నాయకత్వం వహించినందుకు సోనియా గాంధీని కొనియాడారు.

ఇవి కూడా చదవండి: