Home / Congress
:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బుధవారం నాడు తేల్చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక జాతీయ అంశాల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచిద్దామని అన్నారు. దీనితో కాంగ్రెస్కు దీదీకి మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండిచేయి చూపించింది. నిన్నటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా దయాకర్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ తాజాగా ఆయన పేరును తొలగించి మహేష్ కుమార్ గౌడ్ కు కేటాయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనితో దయాకర్ కు మరోసారి ఆశాభంగం ఎదురయింది.
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.
తెలంగాణాలో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామజోగయ్య స్పందించారు. వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్కు పట్టే గతే ఆంధ్రప్రదేశ్లో జగన్కు పట్టబోతుందని జోగయ్య జోస్యం చెప్పారు.