Last Updated:

Nepal plane crash: నేపాల్ విమానప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందదు.. కారణమేమిటో తెలుసా?

: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.కీలకమైన ఎయిర్ క్యారియర్‌ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.

Nepal plane crash: నేపాల్ విమానప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందదు.. కారణమేమిటో తెలుసా?

Nepal plane crash: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.

కీలకమైన ఎయిర్ క్యారియర్‌ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.

అందువలన బాధిత కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారం అందదు.

ముసాయిదా బిల్లు ప్రకారం ఎయిర్ లైన్ ఒక ప్రయాణికుడు లేదా బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు మరియు కష్టాలను తీర్చడం అవసరమని నిర్ణయించే చోట ముందస్తు చెల్లింపు చేయాలని నివేదిక పేర్కొంది.

ప్రతిపాదిత చట్టం ప్రకారం, ఎయిర్‌లైన్ లేదా దాని ఏజెంట్‌లతో సంఘటన జరిగిన 60 రోజులలోపు నష్టపరిహారం దావా వేయాలి.

నేపాల్ యొక్క పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతిపాదిత చట్టం మాంట్రియల్ కన్వెన్షన్ 1999 యొక్క సవరించిన సంస్కరణ అని చెప్పారు.

బీమా బిల్లును ఆమోదించని ప్రభుత్వం..

ఎయిర్ క్యారియర్‌ల బాధ్యత మరియు బీమా కోసం ముసాయిదా బిల్లు అపరిమిత క్లెయిమ్‌లతో సహా విమాన జాప్యానికి సంబంధించిన బాధ్యతను  ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ బుద్ధి సాగర్ లామిచ్చానే మాట్లాడుతూ ముసాయిదా బిల్లు సిద్ధంగా ఉంది.

దానిని క్యాబినెట్‌లో ప్రవేశపెట్టడానికి సిద్దమవుతున్నామని చెప్పారు.

కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.

నేపాల్‌లో ప్రభుత్వంలో తరచుగా మార్పులు మరియు రాజకీయ స్థిరత్వం బిల్లు నెమ్మదిగా ముందుకు సాగడానికి కారణాలని మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు.

మూడేళ్లలో ఏడుగురు మంత్రులు మారారు..

మంత్రులను తరచుగా మార్చడం వల్ల బిల్లు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది.

సాంస్కృతిక, పర్యాటక మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లో మూడు సంవత్సరాలలో ఏడు మంత్రులు మారారు.

విమానప్రమాదంలో గాయపడినా, మరణించినా విమానయాన సంస్దలదే బాధ్యత..

మాంట్రియల్ కన్వెన్షన్ 1999ని ఆమోదించిన రెండు సంవత్సరాల తర్వాత, నేపాల్ 2020లో దేశీయ విమానయానదారులకు బాధ్యత వహించే వ్యవస్థపై ముసాయిదా బిల్లును ఖరారు చేసింది.

ముసాయిదా బిల్లు ప్రయాణికులు మరణించినా లేదా గాయపడినా విమానయాన సంస్థలను బాధ్యులను చేస్తుంది.

ప్రణాళికాబద్ధమైన చట్టం ప్రకారం, దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణీకుల గాయం లేదా మరణానికి కనీసం $ 100,000 పరిహారం చెల్లించాలని నివేదిక పేర్కొంది.

జనవరి 15న నేపాల్‌లోని పోఖారాలో 72 మందితో ప్రయాణిస్తున్న ATR-72 అనే ప్యాసింజర్ విమానం కూలిపోయింది.

ఈ విమానం ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్తోంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.

విమానాశ్రయంలో దిగడానికి పది సెకన్ల ముందు ఇది క్రాష్ అయింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులతో సహా మొత్తం 72 మంది ప్రయాణికులు మరణించారు.

నేపాల్ విమానప్రమాదంలో  భర్త  లాగే మరణించిన  కోపైలట్

నేపాల్‌లోని పోఖారాలో కుప్పకూలిన 72 మందితో కూడిన ఏటీ ఎయిర్‌లైన్స్ – ATR-72 – ATR-72 విమానంలో కో-పైలట్ అంజు పైలట్  కావాలనే తన లక్ష్యాన్ని, కలలను నెరవేర్చుకునేముందే చనిపోయారు.
ఆమె తన దివంగత భర్త దీపక్ పోఖ్రేల్ మాదిరే విధి నిర్వహణలో కన్నుమూసారుజ

ఈ విమానాన్ని సీనియర్ కెప్టెన్ కమల్ కేసీ పైలట్ చేయగా, అంజు విమానంలో కో-పైలట్‌గా ఉన్నారు.

పాత దేశీయ విమానాశ్రయం మరియు పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ప్రవహించే సేతీ నది ఒడ్డున ఉన్న అటవీ భూమిపై విమానం కూలిపోయింది.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/