Justice Girija Priyadarsini: హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత

Telangana high court Justice Girija Priyadarsini Passed Away: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు.
విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే లేబర్ అండ్ ఇండస్ట్రీలా లో మాస్టర్స్ చదివిన ఆమె మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు.
ఇక, 2008 నుంచి 2021 వరకు పలు జిల్లా కోర్టులకు జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లుగా ఎన్నో కేసులకు తీర్పు ఇచ్చారు. కానీ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఇంతలోనే ఆమె చనిపోవడంతో న్యాయవాదులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తొలుత 1995లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన గిరిజా.. విశాఖ జిల్లా కోర్టులో 7ఏళ్లు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత 2008లో అడిషనల్ డిస్టిక్ జడ్జిగా నియామకమయ్యారు. ఇక్కడి నుంచి నేరుగా ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో 3 ఏళ్లు చేశారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా తొలి అడిషనల్ డిస్ట్రిక్ జడ్డిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నంద్యాలలో కూడా అడిషనల్ డిస్ట్రిక్ జడ్డిగా చేశారు.
అలాగే, 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి పొందిన గిరిజా ప్రియదర్శిని.. ఆదిలాబాద్ డిస్ట్రిక్ కోర్టు చీఫ్ జడ్డిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి కరీంనగర్ డిస్ట్రిక్ కోర్టు చీఫ్ జడ్డిగా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు.