Published On:

PBKS Vs DC: పంజాబ్- ఢిల్లీ మధ్య మ్యాచ్.. వర్షంతో ఆలస్యం కానున్న టాస్

PBKS Vs DC: పంజాబ్- ఢిల్లీ మధ్య మ్యాచ్.. వర్షంతో ఆలస్యం కానున్న టాస్

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారింది. దీంతో రాత్రి 7 గంటలకు వేయాల్సిన టాస్.. ఇంకా నిర్వహించలేదు. అదృష్టవశాత్తు భారీ వర్షం లేకపోయినప్పటికీ టాస్ మాత్రం ఇంకా వేయలేదు. వర్షం కారణంగా పిచ్, గ్రౌండ్ పరిస్థితిని అంపైర్లు, ప్లేయర్లు పరిశీలిస్తున్నారు. మ్యాచ్ జరిగేందుకు అవకాశం ఉంటే మాత్రం కొంత ఆట కొంత ఆలస్యంగా ప్రారంభంకానుంది.

 

ప్లే ఆఫ్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్న పంజాబ్, ఢిల్లీ జట్లకు మ్యాచ్ రద్దైతే చెరో పాయింట్ లభించనుంది. 15 పాయింట్లతో పట్టికలో 3వ స్థానంలో ఉన్న పంజాబ్ నేటి మ్యాచ్ లో విజయం సాధించి టాప్ ప్లేస్ వెళ్లాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు నేటి మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధిస్తే 15 పాయింట్లు సాధించి 3వ స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం ఢిల్లీ 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం పంజాబ్ కి, ఢిల్లీకి చెరో పాయింట్ దక్కుతుంది. అలా జరిగితే కోల్ కతా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే.