Pakistan: పాకిస్థాన్ కీలక నిర్ణయం.. ఐఎస్ఐ చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్కు కీలక బాధ్యతలు

Pakistan’s ISI Chief Mohammad Asim Malik National Security Advisor: పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రత సలహాదారుడిగా నియమించింది. 2024 సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్కు ఎన్ఎస్ఏ చీఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే పాకిస్థాన్ దేశంపై భారత్ తీవ్ర ఒత్తిడి పెంచేందుకు పూనుకుంది. ఇప్పటికే సింధు జలాల నిలిపివేత, వీసాల రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. ఈ పరిణామాలతో పాక్ సైన్యంలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా యుద్ధం చేసే అవకాశం ఉందని పాక్ మంత్రులు ప్రకటిస్తున్నారు. ఈ సమయంలోనే ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించకుండా పోవడంతో హాట్ టాపిక్గా మారింది. భారత్ దాడి చేసే అవకాశం ఉందని భయంతో వేరే దేశానికి పారిపోయినట్లు తెలుస్తోంది. అలాగే, గత 2 రోజుల వ్యవధిలో 4,500 మంది సౌనికులు, 250 మంది అధికారులు తమ బాధ్యతలు అప్పగించారు.