Published On:

India Pakistan Officials Meeting: ఆపరేషన్ సిందూర్.. హాట్‌లైన్‌లో భారత్-పాక్ కీలక చర్చలు

India Pakistan Officials Meeting: ఆపరేషన్ సిందూర్.. హాట్‌లైన్‌లో భారత్-పాక్ కీలక చర్చలు

India and Pakistan meeting in hotline about Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గించడం ప్రధాన అంశాలు. శనివారం మధ్యాహ్నం 3:35కు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని, 5 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ దీన్ని ధ్రువీకరించారు. కొన్ని గంటల్లోనే పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.