TDP Former MLA: తీవ్ర విషాదం.. టీడీపీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TDP Former MLA Sugavasi Palakondrayudu Passes Away: ఏపీ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రానాయుడు(78) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో 1946 జులై 3న సుగవాసి పాలకొండ్రాయుడు జన్మించారు. తొలుత 1978లో రాయచోటి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1983లో రెండో సారి అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
టీడీపీలో చేరిన ఆయన 1984లో రాజంపేట లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇందులోనూ ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత సుగవాసి పాలకొండ్రాయుడు.. వరుసగా టీడీపీ తరఫున 1999, 2004లో మళ్లీ రాయచోటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
సుగవాసి పాలకొండ్రాయుడు.. 1968లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ప్రసాద్ బాబు టీడీపీలో పనిచేస్తున్నారు. పాలకొండ్రానాయుడు 40ఏళ్లు టీడీపీలో యాక్టివ్ లీడర్గా పనిచేశారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.