Published On:

Donald Trump: ట్రంప్ 100 రోజుల పాలన.. ఎలా ఉందంటే?

Donald Trump: ట్రంప్ 100 రోజుల పాలన.. ఎలా ఉందంటే?

USA President Donald Trump Marks 100 days: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించి బుధవారానికి వంద రోజులు గడిచింది. ప్రెసిడెంట్‌గా వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆయన డెట్రాయిట్‌లోని మాకోంబ్‌ కౌంటీలో ఓ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. కేవలం మూడు నెలల కాలంలో లెక్కలేనన్ని ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశాడు. అమెరికా ఫస్ట్‌ పాలసీని అమలు చేశారు. గతంలో ఏ అమెరికా ప్రెసిడెంట్‌ చేయని విధంగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై బారీగా టారిఫ్‌ బాదారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి స్టాక్‌ మార్కెట్లకు రుచించడం లేదు. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

 

కాగా, అగ్ర రాజ్యం అమెరికాను ఆదర్శంగా తీసుకుంటాయి ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం ఇతర దేశాలతో పోల్చుకుంటే బలంగా ఉంటుంది. అంతా చట్టం ప్రకారమే జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భావిస్తుంటారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తారని గొప్పగా చెప్పుకుంటారు. ఇక గత ఏడాది నవంబర్‌లో జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్‌ పోల్‌లో ట్రంప్‌ సునాయాసంగా బైడెన్‌పై గెలిచారు. డెమోక్రాటిక్‌ పార్టీపై ప్రజలు విసిగి చెంది.. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీని గెలిపించారు. ఇక ఆయన బాద్యతలు తీసుకున్న వెంటనే గతంలో ఏ ప్రెసిడెంట్‌ చేయని విధంగా ఇష్టం వచ్చినట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ఎడా పెడా సంతకాలు చేసి రికార్డు సృష్టించాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ణును సలహాదారుగా చేసుకొని కేంద్రప్రభుత్వ ఉద్యోగులను ఉద్యగాల్లోంచి తీసి పారేశాడు. వారంతా ట్రంప్‌తో పాటు మస్క్‌ను శాపనార్థాలు పడుతున్నారు.

 

వైట్‌ హౌస్‌ సమాచారం ప్రకారం ఆయన ఈ వందరోజుల్లో 142 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశాడు. ఈ ఆర్డర్లను బలవంతంగా అమలు చేశాడు. అయితే కొన్ని ఆర్డర్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కొన్ని ఆర్డర్లపై స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది జనవరి 20న ఆయన మొదటి రోజు ఆఫీసులో కాలు మోపారు. వచ్చి రాగనే ఆయన 26 ఎగ్జిక్యూటివ్‌ ఆర్టర్లపై సంతకాలుచేశారు. వాటిలో పదిహేను వందల మందికి క్షమాభిక్ష పెట్టాడు. వీరతా 2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన వారే. ఇక 2020 చివర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయాడు. దీంతో ఆయన మద్దతు దారులు పెద్దెత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని జైలుకు పంపతే.. ప్రస్తుతం ట్రంప్‌ వారికి క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌నుంచి తప్పుకున్నారు. గల్ప్‌ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా పేరు మార్చారు ట్రంప్‌.

 

ఇక ట్రంప్‌ సంతకాలు పెట్టిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ విషయానికి వస్తే అక్రమ వలసదార్లతో పాటు సరిహద్దు భద్రత, ఎనర్జీ, ట్రేడ్‌కు సంబంధించిన వాటిపై సంతకాలు చేశారు. దీంతో పాటు పదిహేను వందల మంది క్షమాభిక్ష ప్రసాదించారు. అయితే వారిలో కొంత మంది వివాదాస్పదమైన వ్యక్తులను క్షమాభిక్ష ప్రసాదించడం పెద్ద వివాదంగా మారింది. రోస్‌ ఉల్‌బ్రిచ్‌ విషయానికి వస్తే.. అతిడిపై డ్రగ్‌ ట్రాఫికింగ్‌, మనీలాండరింగ్‌ చార్జీలు ఉన్నాయి . ఒక్క సంతకంతో వారికి మోక్షం కల్పించారు. ఇదిలా ఉండగా ఒక వైపు ఎగ్జిక్యూటవ్‌ ఆర్డర్లు జారీ చేస్తూనే మరో పక్క ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించడానికి ట్రంప్‌… టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ను తన సలహాదారుడి గా నియమించుకున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా డిపార్టుమెంట్‌ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిసియెన్సీ లేదా (డీఓడీజీ)ని ఏర్పాటు చేశారు. అనవసరపు ఖర్చులు తగ్గించాలని ఆదేశించడంలో ట్రంప్‌ కొన్ని విభాగాలను మూసివేశాడు. కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు.

 

ఉద్యోగాలు కోల్పోయిన వారు రోడ్డెక్కి ట్రంప్‌ నిర్ణయాలను తప్పుబట్టడంతో పాటు మస్క్‌ను శాపనార్దాలు పెట్టారు.ఇక మస్క్‌ ఫడరల్‌ బడ్జెట్‌ రెండు ట్రిలియన్‌ డాలర్లలో 8 శాతం అంటే 160 బిలియన్‌ డాలర్లు ఆదా చేస్తానని ట్రంప్‌కు హామీ ఇచ్చాడు. ఇక మస్క్‌ చేసింది ఏమిటంటే ఇతర దేశాలకు అమెరికా ప్రభుత్వం తరపున ఎయిడ్‌ రూపంలో కొంత డబ్బు పంపిస్తుంటారు. దాన్ని ఆపేశారు. అమెరికా బడ్జెట్‌లో కేటాయింపుల వల్ల ఆఫ్రికాలోని కొన్ని దేశాలల్లోని పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. పలు అభివృద్ది కార్యక్రమాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి. అదే పద్దతిని ఇటీవల ఇండియా కూడా అమలు చేసింది. మన పొరుగున ఉన్న నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌లకు కొన్ని వందల డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం మస్క్‌ వాటిని పూర్తిగా రద్దు చేయడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాడు. దీంతో ఎయిడ్‌ డబ్బు మిగిలిపోయింది. ఉద్యోగి వేతనం ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

 

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ అంచనా ప్రకారం ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల ద్వారా ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులపై వేటు వేశారని వెల్లడించింది. అలాగే ఫెడరల్‌ఏజెన్సీకి చెందిన పదివేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. వారిలో ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏయిడ్‌) ను తీసుకుంటే ఇక్కడ వందశాతం ఉద్యోగులను పీకేసింది. మొత్తానికి ట్రంప్‌ వచ్చాక యూఎస్‌ఎయిడ్‌ అనే సంస్థను పూర్తిగా రద్దు చేశారు. ఇక ట్రంప్‌ ఈ వంద రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టారిఫ్‌వార్‌ను మొదలుపెట్టారు. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి ఇక్కడే పరిశ్రమలను స్థాపించి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించాలనుకున్నారు. దీంతో ఏడాపెడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై టారిఫ్‌లు బాదడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా, కెనడాతో పాటు మెక్సికో నుంచి దిగుమతి చేసుకొనే గూడ్స్‌పై దాదాపు ఇరవైఐదు శాతం సుంకాలు విధించారు. అలాగే కెనడా నుంచి దిగుమతి చేసుకొనే ఎనర్జీపై అదనంగా 10 శాతం సుంకం విధించారు. ఇక చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అడ్డూ అదుపులేకుండా 145 శాతం సంకాలు బాదడం మొదలుపెట్టారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తమ తడాఖా ఏంటో చూపిస్తామని చైనా అమెరికాను హెచ్చరించింది.

 

ట్రంప్‌ తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలకు అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ఎస్‌అండ్‌పీ 7.9 శాతం, నాస్‌డాక్‌ 12.1 శాతం, డౌజోన్స్‌ 8.9 శాతం వరకు నష్టపోయాయి. ఇక అమరికాకు చెందిన పెడ్‌ రిజర్వు చీప్‌ జెరోమ్ పావెల్ పై మండిపడ్డాడు. వడ్డీరేట్లు తగ్గించడాఇకి ఇదే సరైన సమయం అని వాదించారు ట్రంప్‌. పదవి నంచి పీకేస్తానని బెదిరంచారు. ఇక్కడ ఫెడరల్‌ రిజర్వు అంటే మన దేశంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ పదవి లాంటిది. వడ్డీరేట్లు తగ్గించాలా వద్దా అనేది వారు లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు. వారు తీసుకొనే నిర్ణయం యావత్‌ ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. పావెల్‌తో గొడవపడ్డం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయానికి వస్తే తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే యుద్ధం అయ్యేది కాదని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే పుతిన్‌ ట్రంప్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. అయినా పుతిన్‌ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అదే జెలెన్‌ స్కీ విషయానికి వస్తే వైట్‌ హౌస్‌ లో మీడియా ముందు యావత్‌ ప్రపంచం లైవ్‌లో చూస్తుండానే బెదిరించడం చూశాం. దీంతో జెలెన్‌ స్కీపై సానుభూతి పెరిగింది. ట్రంప్‌ వ్యవహారశైలిని చాలా మంది తప్పుబట్టారు.

 

ఇక ఇజ్రాయెల్‌ … హమాస్‌ యుద్ధానికి అంతే లేకుండా పోయింది. ఇక ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రెసిడెంట్‌ నెతన్యాహును వెనకేసకువస్తున్నారు. ఇక ట్రంప్‌ వైట్‌ హౌస్‌లో కాలుమోపిన తర్వాత నుంచి ఇజ్రాయెల్‌ గాజాలో 2వేల392 మందిని చంపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇజ్రాయెల్‌ ఈ దారుణానికి పాల్పడింది. ఇక మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా మిలిటీరి యాక్షన్‌ పెంచింది. యమన్‌లో హౌతీలపై వైమానికదాడులు చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 18 వరకు యమన్‌పై అమెరికా 207 వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 209 మంది మృతి చెందారు. ఇక ట్రంప్‌ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీల విషయానికి వస్తే ఆయన కనీసం 75 హామీలు ఇచ్చారు. వాటిలో మాస్‌ డిపోర్టేషన్‌, 2021 క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడిలో జైల్లో ఉన్నవారిని విడిపిస్తామని చెప్పారు. అలాగే మేక్‌ అమెరికా గ్రేట్‌ అగేయిన్‌ పేరుతో ప్రచారం చేపట్టారు. కాగా అమెరికాకు చెందిన నాన్‌ఫ్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ ట్రంప్‌ హామీలపై అద్యయనం చేసి స్కోర్‌ కార్డును విడుదల చేసింది. మొత్తం ఆరు హామీలను అమలు చేస్తే.. ఒక హామీ గాలికి వదిలేశారు. నాలుగు హామీలు అటకెక్కించారు.. మరో 23 హామీలన అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 41 హామీలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.

 

మొత్తానికి ట్రంప్‌ వంద రోజుల పాలన ప్రజలను పెద్దగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. యావత్‌ ప్రపంచ దేశాలను శత్రువులుగా భావిస్తున్నారు. ఇతర దేశాలను పక్కన పెట్టండి స్థానిక అమెరికన్లు కూడా సంతోషంగా లేరు టారిఫ్‌లు విపరీతంగా పెరగడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొన వస్తువుల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం కోరలు చాసింది. సామాన్య అమెరికన్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై లబోదిబో మంటున్నాడు. అయితే వంద రోజుల్లో పాలన గురించి బేరేజు వేయడం తొందరపాటు చర్యే అవుతుంది. రాబోయే రోజుల్లో ట్రంప్‌ వ్యవహరా శైలిలో మార్పు రావాలని కోరుకుందాం.