Pakistani News Anchor Crying: ఆపరేషన్ సింధూర్.. లైవ్లో ఏడ్చేసిన పాక్ యాంకర్..!

Pakistani News Anchor Crying: పహల్గామ్ దాడి తర్వాత, భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో కలకలం రేగుతోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీడియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ న్యూస్ ఛానల్ యాంకర్ తీవ్రంగా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఐపీ సింగ్ స్పందించారు.
ఎస్పీ నాయకుడు ఐపీ సింగ్ తన సోషల్ మీడియా ఖాతా X లో ఒక పాకిస్తానీ యాంకర్ వీడియోను షేర్ చేశారు, అందులో ఆమె ఏడుస్తూ దాడిలో మరణించిన వ్యక్తుల కోసం విచారం వ్యక్తం చేస్తూ, దేవుడు వారికి బలాన్ని ప్రసాదించుగాక అని చెబుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఎస్పీ నాయకుడు ఇలా అన్నాడు- ‘పాకిస్తానీ టీవీ యాంకర్.. మీరు ఇంకా ఎక్కువగా ఏడవాలి.’ సింధూరాన్ని నాశనం చేసే వారి గతి ఇలాగే ఉంటుంది. భారతదేశం ఉగ్రవాదాన్ని తుడిచిపెడుతుంది.. జై హింద్.
A Pakistani News Anchor Started Crying on Live TV after India’s
Operation Sindhoor against Pakistan
~ What’s your take on this
pic.twitter.com/BhJFkvih2C
— Richard Kettleborough (@RichKettle07) May 7, 2025
పహల్గామ్ సందర్శించడానికి వెల్లిన భారతీయ పౌరులను వారి మతం గురించి అడిగినందుకు కాల్చి చంపారు. ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదుల ఈ సాహసానికి తగిన సమాధానం ఇస్తామని ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా భారతదేశం ఇలాంటి సమాధానం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సరిగ్గా ఇదే జరిగింది.
మంగళవారం రాత్రి, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై ఎంపిక చేసిన చర్యలు తీసుకోవడం ద్వారా 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ చర్య తర్వాత, యుపిలో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ఉత్తరప్రదేశ్ డీజీపీ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.