Samantha With Raj Nidimoru: ఆ రూమర్సే నిజమా! డైరెక్టర్తో రెండో పెళ్లి.. సమంత ఇలా హింట్ ఇచ్చిందా..

Samantha Shared Photos With Raj Nidimoru: సమంత ప్రస్తుతం ‘శుభం’ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. నిర్మాత తనకు ఇది తొలి చిత్రం. దీంతో ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు తెగ కృషి చేస్తుంది. వరస ఇంటర్య్వూలు, ప్రమోషనల్ కార్యక్రమానికి నిర్వహిస్తూ ‘శుభం’ను ప్రమోట్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో వరుసగా పొస్ట్స్ షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని, ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు.
కొత్త ప్రారంభం?
ఈ వార్తల నేపథ్యంలో తరచూ ఆమె రాజ్ నిడిమోరుతో కలిసి కెమెరాలకు చిక్కుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లిన రాజ్ నిడిమోరు ఆమె వెంటే ఉంటున్నారు. దీంతో ఈ రూమర్స్కి మరింత బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇందులో రాజ్ నిడిమోరు ఫోటో కూడా ఉంది. శుభం టీం, డైరెక్టర్ నందిని రెడ్డితో పాటు మూవీ ప్రమోషన్స్ భాగంగా సమంత దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీనికి “ఇది చాలా దూరం వెళ్లింది. కానీ మనం ఇక్కడే ఉన్నాం. ట్రాలాల కొత్త ప్రారంభం. మే 9న శుభం రిలీజ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్తో అసలు సంబంధం లేని రాజ్ నిడిమోరు కూడా జత చేసింది.
సమ్థింగ్ సమ్థింగ్..
పైగా తన పెట్ డాగ్ సాషాతో రాజ్ నిడిమోరు ఆడుతూ ఉన్న ఫోటోని తన పోస్ట్కి జత చేసింది. పైగా కొత్త ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో నెటిజన్స్ అంత సమ్థింగ్ సమ్థింగ్ అంటున్నారు. వీరిద్దరు పెళ్లి రూమర్స్ వేళ.. సామ్ ఈ పోస్ట్ చేయడం వెన అంతర్యం ఏంటనీ, అంటే ఆ పుకార్లు నిజమే అన్నట్టు హింట్ ఇచ్చిందా సందేహిస్తున్నారు. మరోవైపు ఇది నాగ చైతన్యకు రీ కౌంటర్ అయ్యిండోచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. సమంత హష్తో దిగిన ఫోటోతో పాటు.. రాజ్ నిడిమోరు సాషాతో దిగిన రెండు ఫోటోలు తన పోస్ట్ మెన్షన్ చేసింది. ఈ పోస్ట్తో తన మాజీ భర్త నాగ చైతన్యకు రీ కౌంటర్ ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మాజీ భర్తకు రీకౌంటర్
దీనికి కారణం.. గతంలో చై చేసిన పోస్ట్. నిజానికి నాగ చైతన్య సోషల్ మీడియాకు దూరమనే విషయం తెలిసిందే. అంతేకాదు తన వ్యక్తిగత విషయంలో గొప్యత పాటిస్తుంటాడు. తన సినిమా అప్డేట్స్, కీలక ప్రకటనలు తప్పితే సోషల్ మీడియాలో ఏ పోస్ట్స్ పెట్టడు. అలాంటిది సందర్భంగా లేకుండ ఇటీవల పెట్ డాగ్ హష్ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చాడు. శోభిత, హష్లు క్లోజ్గా ఉన్న ఫోటో కూడా జత చేశాడు. హష్ సామ్కు ఎంతో ఇష్టమైన పెట్. దానిని శోభిత కలిపి షేర్ చేయడం నిజంగా ఆమె బాధించే విషయమే. మాజీ భార్యపై రివేంజ్గా ఈ పోస్ట్ పెట్టాడనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి రీ కౌంటర్గా సమంత ఈ పోస్ట్ చేసి ఉంటుందని పలువురు సందేహిస్తున్నారు. ఏదేమైనా.. ఇటీవల తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించన్న సామ్.. ఈ పోస్ట్తో మరోసారి వార్తల్లో నిలిచింది.
View this post on Instagram