India vs Pakistan: యుద్ధమే వస్తే భారత్పై న్యూక్లియర్ దాడి.. పాక్ అంబాసిడర్ సంచలన వ్యాఖ్యలు!

Pakistan Ambassador Strong Warning to India: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో రష్యాలో ఉన్న పాకిస్థాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ ఓ ఇంటర్వ్యేలో మాట్లాడారు. పాక్లోని పలు ప్రాంతాలపై భారత్ దాడి చేయనుందన్న విషయం కొన్ని లీక్డ్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్రతి దాడి చేస్తామని, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని వ్యాఖ్యానించారు.
కాగా, భారత్ ప్రతీకారదాడులు తథ్యమని పాకిస్థాన్ భావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారత్ దాడులు చేస్తుందని పాక్ పాలకులు అంటున్నారు. ఇదే స్వరంను పాకిస్థానీ రాయబారి వినిపించారు. లీకైన డాక్యుమెంట్ల ద్వారా తెలిసిందని పాకిస్థానీ రాయబారి ఖాలిద్ జమాలీ వెల్లడించారు.
‘పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాలపై భారత్ దాడులు చేస్తుంది. తద్వారా భారద్ దాడులకు సమయం ఆసన్నమైందని మేం భావిస్తున్నాం. ఈ సారి భారత్ దాడులు చేస్తే పాక్ సైన్యం ఎదుర్కొంటుంది. భారత్, పాకిస్తాన్కు సంబంధించి దాడుల విషయంలో జరుగుతున్న చర్చలోకి మేం వెళ్లడం లేదు. కానీ యుద్ధమే వస్తే సంప్రదాయ ఆయుధాలతో పాటు అణ్వస్థ్రాలను పాకిస్థాన్ పూర్తిస్థాయిలో ఉపయోగిస్తుంది.
ఇదిలా ఉండగా, అమృత్సర్లోని పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. ఇద్దరు గూఢచారులను భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. భారత్లో పరిణామాలను పాక్కు గూఢచారులు చేరవేస్తున్నారు. ఈ మేరకు ఆ ఇద్దరు గూఢచారులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.
NUCLEAR warning from Pakistan to India
Diplomat says Islamabad could use NUKES in case of war with New Delhi
‘Pakistan will use full spectrum of power, BOTH conventional and nuclear’ — ambassador to Russia tells RT https://t.co/iTQWdWRQlZ pic.twitter.com/LcQXKbIjD0
— RT (@RT_com) May 3, 2025