Karachi Port Damaged: కరాచీ పోర్ట్కు భారీ నష్టం!?, ఎక్స్లో పోస్ట్ చేసి తీసేశారు

Karachi Port Damaged: కరాచీ పోర్ట్ పై భారత నావికా దళం చేసింది. పోర్ట్ కు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ దాడులతో కోలుకోలేని దెబ్బ తగిలిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాసేపటికే కరాచి పోర్ట్ ట్రస్ట్ ఆ ట్వీట్ తొలగించింది. భారత్ తమ ఎక్స్ అకౌంట్ను హ్యాక్ చేసిందంటూ.. పోస్ట్ల మీద పోస్టులు కరాచీ పోర్ట్ ట్రస్ట్ పెడుతోంది. అకౌంట్ హ్యాక్ అయితే మళ్లీ ఎలా పోస్ట్లు పెట్టిందే తెలుసుకోలేని స్థితిలో పోర్ట్ ట్రస్ట్ ఉంది. ప్రస్తుత పరిస్థితిపై ఒక్క ఫొటో కూడా కరాచీ పోర్ట్ ట్రస్ట్ పెట్టలేదు. నిన్న జరిగిన దాడిలో కరాచీ పోర్టుకు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. బయటపెట్టి పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక పాక్ సర్కార్ దాస్తోంది. ఇప్పటివరకు రెండు దేశాలు కన్ఫామ్ చేయలేదు.

karachi port damaged by indian forces
పాక్ డ్రోన్లను ఆకాష్ మిస్సైల్ చిత్తు చిత్తుగా కూల్చేసింది. పాక్ JF-17 ఫైటర్ జెట్ను కూల్చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆకాష్ మోహరించింది. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఆకాష్ ఛేదించనుంది. భారత్ సొంత టెక్నాలజీతో ఆకాష్ రూపొందించింది. భూమినుంచి నేరుగా టార్గెట్ను ఛేదించే విధంగా ఆకాష్ను రూపొందించారు. ఆకాష్ ద్వారానే డ్రోన్లను కూల్చినట్టు ఆర్మీ వెల్లడించింది. మీడియం రేంజ్లో లక్ష్యాలను ఆకాష్ ఛేదిస్తుంది. దీనికి రియల్ టైం దాడులను గుర్తించి ఛేదించే సామర్థ్యం కూడా ఉంది.
ఆపరేషన్ సిందూర్ విజయంతో భారతీయులు గర్వపడుతున్నారు. పాకిస్థాన్కు భారత్ సైన్యం సరైన గుణపాఠం చెప్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సైనికుల కుటుంబాలకు మాజీ ఆర్మీ సైనికులు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా సైనికుల ఇళ్లపై జాతీయ జెండాలతో భరోసా కల్పిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ 2.0 కొనసాగుతుంది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. భారతదేశ రక్షణ శాఖకు కేటాయించిన నిధుల్లో.. 10 శాతం పాకిస్తాన్ దేశ బడ్జెట్ ఉంటుందన్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప పాకిస్తాన్లో పస లేదన్నారు. యుద్ధానికి సిద్ధమంటూనే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోందన్నారు. ఒకపక్క తీవ్రవాదానికి వ్యతిరేకం అంటూనే.. మరోపక్క తీవ్రవాదులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిస్తే తాము కూడా యుద్ధంలో పాల్గొంటామని ఆయన అన్నారు.