IND-W Vs SL-W Final Match: ఫైనల్లో శ్రీలంకపై స్మృతి మంధాన సెంచరీ.. భారత్ భారీ స్కోర్..!

India Women Vs Sri Lanka Women Final Match: భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 342 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో స్మృతి మంధనా(116) సెంచరీతో కదం తొక్కింది. అలాగే హర్లీన్ డియోల్(47), హర్మన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(44), ప్రతీక రావల్(30), రిచా ఘోష్(8), అమన్ జోత్ కౌర్(18), దీప్తి శర్మ(20) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దేవ్ మి విహంగ, సుగందిక కుమారి, మల్కి తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఇనోకా రణవీర వికెట్ తీసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 70 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇనోకా రణవీర బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయింది. దీంతో క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్ నిలకడగా ఆడసాగింది. ఇక, మంధానా కేవలం 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆ తర్వాత చమీర ఆటపట్టు వేసిన బౌలింగ్లో వరుసగా 4 పోర్లు బాది 92 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. వన్డేల్లో ఈ సెంచరీ ఆమెకు 11వది కావడం విశేషం.