Last Updated:

Sarkaru Vaari Paata : సర్కారువారి పాటకు మరో రూ.100 కోట్లు రావాలి.. పరుచూరి గోపాలకృష్ణ

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది కానీ ప్రేక్షకులను లేదా అభిమానులను పెద్దగా సంతృప్తి పరచలేదు. పోకిరి లేదా అతడు వంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడంలో సినిమా విఫలమైందని వారు అభిప్రాయపడ్డారు.

Sarkaru Vaari Paata : సర్కారువారి పాటకు  మరో రూ.100 కోట్లు రావాలి.. పరుచూరి గోపాలకృష్ణ

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది కానీ, ప్రేక్షకులను లేదా అభిమానులను పెద్దగా సంతృప్తి పరచలేదు. పోకిరి లేదా అతడు వంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడంలో సినిమా విఫలమైందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ చిత్రాన్ని విశ్లేషించారు.

మహేష్, కీర్తి సురేష్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో బాగా పనిచేశాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. వాటిని మరికొంత సమయం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బదులుగా, దర్శకుడు సడన్‌గా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి మహేష్‌ను ఇండియాకు తిరిగి వచ్చేలా చేసాడని అన్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌ని రివీల్ చేసే ముందు కామెడీ సన్నివేశాలను కొనసాగిస్తే, సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చేవని ఆయన అన్నారు.

హీరో మహేష్ బాబు  విలన్ సముద్రఖని మధ్య డైలాగ్స్  అంత  ఎఫెక్టివ్‌గా లేవని  కూడ ఆయన  అభిప్రాయపడ్డారు.కీర్తి మరియు మహేష్ మధ్య  హాస్య సన్నివేశాలపై  ఎక్కువ దృష్టి పెడితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదనంగా రూ.100 కోట్లు వసూలు చేసి ఉండేదని పరుచూరి తెలిపారు. సర్కారు వారి పాటకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు.

 

ఇవి కూడా చదవండి: