Published On:

Producer Allu Aravind: సంధ్య థియేటర్‌ ఘటన – చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసు

Producer Allu Aravind: సంధ్య థియేటర్‌ ఘటన – చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసు

Producer Allu Aravind Visit Sri Tej: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసులు తాజాగా పరామర్శించారు. గత ఐదు నెలలుగా కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ ఇటీవల డిశ్చార్జ్‌ అయ్యాడు. అనంతరం అతడిని ఏషియన్‌ ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటిఏషన్‌ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు సోమవారం అల్లు అరవింద్‌, బన్నీవాసులు వెళ్లారు. అక్కడ డాక్లర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చేరినప్పటి అతడి వైద్య ఖర్చులను అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌లు చూసుకుంటున్నారు. గతంలో శ్రీతేజ్‌ కోలుకోవాలని ఆశిస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌ 50 లక్షలు, అల్లు అర్జున్‌ రూ. కోటి, సుకుమార్‌ 50 లక్షలు చోప్పున విరాళం ఇచ్చారు.

 

అలాగే శ్రీతేజ్‌ పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి చేరే వరకు భవిష్యత్లులో అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అరవింత్‌ హామీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్‌ 4న పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌లో వేసిన బెనిఫిట్‌ షో చూసేందుకు శ్రీతేజ్ కటుంబం వచ్చింది. అదే టైంలో అల్లు అర్జున్‌ థియేటర్‌ రావడంతో ఆయనను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా.. ఈ ఘటన శ్రీతేజ్‌ తల్లి రేవతి మరణించగా.. శ్రేతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని వెంటనే సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐదు నెలలుగా శ్రేతేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.