Published On:

kajal Aggarwal: కూకట్‌పల్లిలో కాజల్‌ అగర్వాల్‌ సందడి – గోకులం సిగ్నేచర్‌ జువెల్లరి కొత్త షోరూం ప్రారంభోత్సవం..

kajal Aggarwal: కూకట్‌పల్లిలో కాజల్‌ అగర్వాల్‌ సందడి – గోకులం సిగ్నేచర్‌ జువెల్లరి కొత్త షోరూం ప్రారంభోత్సవం..

Kajal Aggarwal Launch Gokulam Signature Jewellers Showroom: హీరోయిన్‌ కాజల్‌ కుకట్‌పల్లిలో సందడి చేసింది. అక్కడ గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షారూమ్‌ను నూతనంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌‌లో ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్‌ అగర్వాల్‌ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, నిర్వాహకులు శ్రీ పొత్తూరి సుబ్బా రావు, శ్రీమతి పొత్తూరి లలిత కుమారి, శ్రీ బాబు రావు గారు అన్నారు. ఈ షోరూమ్‌ ప్రారంభించిన అనంతరం.. కాజల్‌ మాట్లాడుతూ.. గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ షోరూమ్‌లో సిల్వర్‌ జూవెల్లరీ, లాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌, వివాహా వేడుకలతో పాటు అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక్షన్స్‌ ఉన్నాయన్నారు. ఇక్కడ డైమండ్‌ సెట్స్‌ చాలా బాగున్నాయని, వాటిని ధరించి చూస్తే ఎంతో అందంగా అనిపించాయని పేర్కొన్నారు.

 

అనంతరం షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘కూకట్‌పల్లిలో తమ షోరూమ్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ప్రజలు మంచి పేరు తెచ్చి మమల్ని ఆదరిస్తున్నారన్నారు. మా కస్టమర్లకు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో వెండి, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని అన్నారు. గాజులు, మంగళ సూత్రం, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.

 

అలాగూ ‘గోకులం’ అనే పేరు శ్రీకృష్ణుని సంతోషకరమైన నివాసం సారాంశం నుండి ప్రేరణ పొందిందని, ఆనందం, ఆకర్షణ, దైవిక వేడుకలకు ప్రతీక ఇది అన్నారు. ప్రతి ముక్క ఈ స్ఫూర్తితో రూపొందించబడిందని, తాము మేము సృష్టించే ఆభరణాలలో అందంతో పాటు పండుగను తీసుకువస్తుందన్నారు. హైదరాబాద్‌లో మా గోకులం కొత్త షోరూమ్‌ను ప్రారంభించడం ప్రధాన దశను సూచిస్తుందని, దశాబ్దాల నైపుణ్యంతో, బ్రాండ్ సున్నితమైన డిజైన్, క్లిష్టమైన పనితనంతో పాటు సమకాలీన ఆభరణాలు, వెండి యొక్క గ్రహించిన విలువను పెంచడానికి ప్రసిద్ధి చెందిందని వారు చెప్పుకొచ్చారు.