Last Updated:

Delhi: కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన కొడుకు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.

Delhi: కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన కొడుకు

Delhi: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని పాలమ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున ఈ దారణం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతిచెందిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడి ఉండగా, మరొ రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు డగ్స్‌కు బానిసగా మారాడని చెప్పారు. అయితే హత్యలకు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: సూట్ కేసులో అమ్మాయి శవం.. కన్నతండ్రే కసాయిగా మారి..!

ఇవి కూడా చదవండి: