Published On:

PM Modi: వారంరోజుల వ్యవధిలో రెండోసారి .. ప్రధాని మోదీ అధ్యక్షతన 4 కీలక సమావేశాలు

PM Modi: వారంరోజుల వ్యవధిలో రెండోసారి .. ప్రధాని మోదీ అధ్యక్షతన 4 కీలక సమావేశాలు

Union Cabinet Meeting Chaired by PM Modi Today: ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ జరగనుంది. వారంరోజుల వ్యవధిలో రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. ప్రధానితో మీటింగ్‌లో హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థికశాఖ మంత్రులు హాజరుకానున్నారు. కాగా, ప్రతి దాడులపై భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత సైనికుల శక్తిసామర్థ్యాలపై పూర్తి భరోసా కల్పించారు.

 

ఢిల్లీలో ఇవాళ నాలుగు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్స్ జరగనున్నాయి. ఇందులో భాగంగానే మొదట భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, కేంద్ర కేబినెట్ సమావేశాలు, చివరిగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ కానుంది.

 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో మోదీ వరుస భేటీలు కానున్నాయి. అయితే, నియంత్రణరేఖ దగ్గర పాక్ కవ్వింపు చర్యలు చేపట్టడంతో పాటు రక్షణశాఖ విభాగాలపై సైబర్ దాడులకు కుట్ర చేస్తోంది. ఇలాంటి పాకిస్థాన్ కుట్రలను భారత్ తిప్పికొడుతోంది. పహల్గామ్‌కు త్వరలో దీటైన జవాబు ఇద్దామని ప్రధాని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే, ఉగ్రవాదంపై పోరులో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.