Published On:

Indian Army: విషాదం.. 700 అడుగుల లోయలో ట్రక్కు పడి ముగ్గురు జవాన్లు మృతి

Indian Army: విషాదం.. 700 అడుగుల లోయలో ట్రక్కు పడి ముగ్గురు జవాన్లు మృతి

Indian Army Vehicle Falls Into Gorge three Soldiers Dead: జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందని ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 11.30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 44 వెంట శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడింది.

 

వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని రంగజభన్ జిల్లాలో రాంభవ్ వద్ద 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. కాగా, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 

బ్యాటరీ చెష్మా ప్రాంతం వద్ద ఆర్మీ వాహనం అదుపుతప్పి పడినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇందులో అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్‌లు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్యూఆర్టీ టీంలు రాంభవ్ వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.