Delhi due to storm and rain: ఢిల్లీలో భారీ వర్షానికి నలుగురు మృతి.. 40 విమానాలు రద్దు

Delhi due to storm and rain, 40 flights cancelled, 122 delayed: ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ద్వారకలో ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, మరోవైపు 40 విమానాలను ఢిల్లీ విమానాశ్రయం రద్దు చేయగా.. 122 ఆలస్యంగా నడవడంతోపాటు పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.
ఇదిలా ఉండగా, తెల్లవారుజామున ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మరోవైపు ఉరుములు, మెరుపులతో ద్వారకతో పాటు కాన్పూర్, మింటో, సౌత్ రింగ్ రోడ్డు, మోతీ బాగ్, లజ్ పత్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు జలాలు నీట మునిగాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ మేరకు భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా గంటకు 70 నుంచి 80 కిలీమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఇవాళ సాయంత్రం మాత్రం గంటలకు 40 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.