Pakistan Cross Border: పాక్ మరోసారి కాల్పులు.. తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ

Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే 13 మంది అమాయక భారత్ పౌరులు చనిపోగా.. మరో 57 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు ఇండియన్ ఆఱ్మీ వెల్లడించింది.
మే 7-8వ తేదీల్లో అర్ధరాత్రి పూంచ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. ప్రధానంగా నివాస ప్రాంతాలే టార్గెట్గా కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం అలర్ట్ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే కొంతమంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో స్కూళ్లతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గురుదాస్పుర్.. రాజస్థాన్లోని గంగానగర్, బీకానేర్, జైసల్మేర్, బాడ్బమేడ్ వంటి ప్రాంతాల్లో అన్ని పాఠశాలలకు అధికారంగా సెలవులు ఇవ్వడంతో మూసివేశారు.
During the night of May 7-8, Pakistan Army posts resorted to unprovoked fire using small arms and artillery guns across the LoC in areas opposite Kupwara, Baramulla, Uri and Akhnoor areas in J&K. Indian Army responded proportionately: Indian Army pic.twitter.com/CAM2YXDXui
— ANI (@ANI) May 8, 2025