India: పాకిస్థాన్పై నీటి యుద్ధం.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్

India Curb on water flow through Baglihar: భారత్, పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన భారత్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, పాకిస్థాన్పై భారత్ నీటి యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్పై భారత్ రెండో దశ చర్యలు ప్రారంభించింది.
భారత్ నుంచి పాక్కు నదీజలాల ప్రవాహాలను కట్టడి చేసింది. ఇప్పటికే సింధు నది జలాల ప్రాజెక్టు మూసివేసింది. మరో రెండు నదుల విషయంలోనూ చర్యలు చేపట్టింది. చీనాబ్, జీలం నదులపై డ్యామ్ల మూసివేతకు చర్యలు తీసుకుంది. బగ్లిహర్ డ్యామ్, కిషన్ గంగా డ్యామ్ నుంచి పాకిస్థాన్కు నీరు వెళ్లకుండా భారత్ చర్యలు తీసుకుంటుంది.
ఇలా భారత్ చర్యలతో పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే పాకిస్థాన్తో పూర్తిగా వాణిజ్యం నిలిపివేసింది. అంతేకాకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్థాన్ నుంచి ఎగుమతులు, దిగుమతులు రోడ్, వాటర్ ట్రాన్స్ పోర్టు, మెయిల్స్, పార్శిల్స్పై భారత్ ఆంక్షలు విధించింది. దీంతో భారత్ చక్రబంధంలో పాకిస్థాన్ చిక్కుకున్న పని అయింది.