Home / Delhi
Congress: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ చెప్పారు. గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు సోనియాను నిరంతరం […]
Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు […]
Fire accident in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా సెక్టార్-13లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం 9:58 గంటల సమయంలో ఘటన జరిగింది. అపార్ట్మెంట్లోని 8,9 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. […]
Indian Foreign Minister S.Jaishankar fires on Pakistan : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాక్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదన్నారు. బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్ లామీతో జైశంకర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రగా ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని స్పష్టం […]
Delhi International Airport Limited : ఢిల్లీలో ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయ రన్ వే ఆధునికీకరణలో భాగంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 86 విమానాలను తిరిగి రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. వాటాదారులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత నిర్ణయానికి వచ్చినట్లు డయల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదేహ్ […]
Aravali Green Wall Project: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ రీలాంచ్ చేశారు. అందులో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మోదీ మర్రిచెట్టును నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని […]
ACB issued summons to Aam Aadmi Party Leaders: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్ రూమ్ ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న జైన్, జూన్ 9న సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొంది. ఏప్రిల్ 30న ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. […]
New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ కానుంది. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అలాగే […]
CM Chandrababu Naidu participates in CII annual conference : సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయని […]
Union Cabinet Meeting Toady : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరుగుతాయని సమాచారం. అలాగే దేశంలో పరిపాలన నిర్ణయాలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు టాక్. ముఖ్యంగా దేశంలో తాజాగా ఉన్న సమస్యలు ఉగ్రవాదం అణచివేత, వాణిజ్యం, […]