Last Updated:

Student Death : స్కూల్ లో టీచర్ పనిష్‌మెంట్‌.. గుంజిల్లు తీస్తూ విద్యార్ధి మృతి

సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్‌మెంట్‌ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Student Death : స్కూల్ లో టీచర్ పనిష్‌మెంట్‌.. గుంజిల్లు తీస్తూ విద్యార్ధి మృతి

Student Death : సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్‌మెంట్‌ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషాధ ఘటన ఒరిస్సాలోని జైపూర్‌ జిల్లా ఒరాలీ గ్రామంలో జరిగింది. బాలుడి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒరాలీ గ్రామంలోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సూర్యనారాయణ్‌ నోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో రుద్ర నారాయణ్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. అతని వయస్సు పది సంవత్సరాలు. కాగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్ధి పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ఉన్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ఓ ఉపాధ్యాయుడు వారిని చూసి పనీష్‌మెంట్‌ ఇచ్చాడు. అందరినీ గుంజీల్లు ఆదేశించాడు. దాంతో ఐదుగురు విద్యార్ధులు గుంజీలు తీయడం ప్రారంభించారు.

కానీ కొద్దిసేపటికి ఒక్కసారిగా రుద్ర కుప్పకూలిపోయాడు. విషయం అతని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వెంటనే వారు దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మార్గం మధ్యలో విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని రసూల్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నీలాంబర్ మిశ్రా తెలిపారు. అధికారికంగా ఫిర్యాదు అందితే, విచారణ ప్రాప్రారంభించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు.