Last Updated:

Rahul Gandhi: ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లే ముందు నా తల నరుక్కుంటాను.. రాహుల్ గాంధీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.

Rahul Gandhi: ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి  వెళ్లే ముందు నా తల నరుక్కుంటాను.. రాహుల్ గాంధీ

Rahul Gandhi: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. తన సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురించి, చెబుతూ రాహుల్ వ్యాఖ్యలు చేసారు.

వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నాడు, అతను ఇక్కడకు వస్తే అది అతనికి సమస్య కావచ్చు.

నా భావజాలం అతని భావజాలంతో సరిపోలడం లేదు. నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లలేను.

అంతకుముందు నా తల నరికివేయవలసి ఉంటుంది. నా కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంది.

వరుణ్ మరొక సిద్ధాంతాన్ని స్వీకరించాడు. నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని అన్నారు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు.

దేశంలోని అన్ని సంస్థలను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు స్వాధీనం చేసుకున్నాయని రాహుల్ ఆరోపించారు.

మీడియా, ఎన్నికల సంఘం మరియు న్యాయవ్యవస్థపై “ఒత్తిడి” ఉందని పేర్కొన్నారు.

నేను జర్నలిస్టులను విమర్శించను, మీడియా నిర్మాణాన్ని విమర్శిస్తాను. నాకు న్యాయమైన, స్వతంత్ర మీడియా కావాలి.

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.

పంజాబ్‌ను ఢిల్లీ నుండి కాకుండా పంజాబ్ నుండి మాత్రమే నడపాలని రాహుల్ అన్నారు.

ఈ రోజు దేశంలోని అన్ని సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ మరియు బిజెపి నియంత్రిస్తున్నాయి. అన్ని సంస్థలపై ఒత్తిడి ఉంది.

ప్రెస్ ఒత్తిడిలో ఉంది, బ్యూరోక్రసీ ఒత్తిడిలో ఉంది, ఎన్నికల సంఘం ఒత్తిడిలో ఉంది.

వారు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చారని రాహుల్ ఆరోపించారు.

పంజాబ్ సీఎంపై రాహుల్ వ్యాఖ్యలు..

ఇది ఒక రాజకీయ పార్టీకి, మరో రాజకీయ పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు.

ఇది ఇప్పుడు వారు స్వాధీనం చేసుకున్న దేశంలోని సంస్థలు మరియు ప్రతిపక్షాల మధ్య పోరాటమని రాహుల్ అన్నారు.

ప్రస్తుతం దేశంలో సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియలు లేకుండా పోతున్నాయని ఆయన ఆరోపించారు.

తాను ఎవరికీ రిమోట్ కంట్రోల్ కాకూడదని, స్వతంత్రంగా రాష్ట్రాన్ని నడపాలని రాహుల్ గాంధీ

సోమవారం పంజాబ్ సీఎం ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

2019లో తన తల్లి మేనకా గాంధీని నరేంద్ర మోడీ క్యాబినెట్‌లోకి తిరిగి చేర్చుకోకపోవడంతో

వరుణ్ గాంధీ బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

బీజేపీ విధానాలను బహిరంగంగా పలుమార్లు విమర్శించారు.

బీజేపీ కేంద్ర నాయకత్వం వరుణ్, అతని తల్లి మేనకా గాంధీని ఏమాత్రం పట్టించుకోలేదు.

పార్టీలో తమపట్ల నిరాదరణ ఉందన్న విషయం తెలిసికూడా తల్లీ కొడుకులు ఏమీ చేయలేని పరిస్దితి

ఒకప్పుడు బీజేపీకి అతిపిన్నవయస్కుడైన జనరల్ సెక్రటరీగా వరుణ్ గాంధీ పనిచేసారు.

ప్రస్తుత పరిస్దితిని అతను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

భవిష్యత్తులో వరుణ్, మేనకా గాంధీ బీజేపీని వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/