Last Updated:

PM Modi inaugurated: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైలు ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1న తేదీని నిర్ణయించినట్లు తెలుసుకున్నప్పుడు, కాంగ్రెస్‌లోని 'స్నేహితులు' దానిని ప్రధాని మోదీ ఏప్రిల్ ఫూల్ అని పిలుస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు.

PM Modi inaugurated: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును  ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurated: భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైలు ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1న తేదీని నిర్ణయించినట్లు తెలుసుకున్నప్పుడు, కాంగ్రెస్‌లోని ‘స్నేహితులు’ దానిని ప్రధాని మోదీ ఏప్రిల్ ఫూల్ అని పిలుస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. “కానీ మీరందరూ చూడగలిగే విధంగా రైలు ఏప్రిల్ 1 న మాత్రమే ప్రారంభమైంది. ఇది మా నైపుణ్యం మరియు విశ్వాసానికి చిహ్నం” అని మోదీ అన్నారు.\

ఒక కుటుంబాన్నే మొదటి కుటుంబంగా..(PM Modi inaugurated)

గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకును బుజ్జగించడంలో ఎంతగానో మునిగిపోయాయంటే, ప్రజల సౌలభ్యంపై దృష్టి సారించలేదు. వారు ఒక కుటుంబాన్ని మొదటి కుటుంబంగా పరిగణించేవారు. రెండవ మరియు మూడవ కుటుంబాల గురించి ఏమిటి? వారికే వదిలేశారు.ఇక్కడ బాధితుడు భారతీయ రైల్వే అని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మండిపడ్డారు.2014కు ముందు భారతీయ రైల్వే సమస్యలకు పరిష్కారం లేదని తెలిసి కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేయడం మానేశారని ప్రధాని మోదీ అన్నారు. గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగిందన్నారు. 2014కి ముందు రూ600 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో మధ్యప్రదేశ్‌కు రూ13,000 కోట్లు కేటాయింపులు జరిగాయని ప్రధాని మోదీ చెప్పారు.

2014 తర్వాత మన దేశంలో కొందరు వ్యక్తులు  నాప్రతిష్టను దిగజార్చేందుకు పాల్పడ్డారు. వారు బహిరంగంగా కూడా చెప్పారు. ఇందుకోసం వారు వేర్వేరు వ్యక్తులతో ముచ్చటించారు. వారికి సహాయం చేయడానికి, దేశం లోపల మరియు వెలుపల ప్రజలు ఉన్నారు. ఈ వ్యక్తులు నాప్రతిష్టను దెబ్బతీయడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేడు ప్రతి భారతీయుడు మోదీకి సురక్ష కవచమని మోదీ అన్నారు.న్యూఢిల్లీ-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శనివారం మినహా వారానికి ఆరు రోజులు నగరాల మధ్య నడుస్తుంది. రైలు భోపాల్‌లో ఉదయం 5:40 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1:10 గంటలకు నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకుంటుంది.