Published On:

PM Modi: ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ!

PM Modi: ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ!

 

PM Modi: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పాకిస్థాన్ తో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ తీసుకునే సైనిక చర్యను  మోదీ సమీక్షిస్తున్నారు.

ఏప్రిల్ 26న, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ తో సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో, పాకిస్తాన్‌పై జరిపే చర్యలకు ఆర్మీకి ఫ్రీహ్యండ్ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ఏప్రిల్ 30న మోదీని కలిశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

పహల్గామ్ ఊచకోతపై భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు తక్షణమే అమలులోకి వచ్చేలా ఉద్యోగులందరి సెలవులను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా రక్షణ సంసిద్ధత పెరిగిన సమయంలో ఈ చర్య తీసుకోబడింది.

 

ఏప్రిల్ 22న, బైసరన్ లోయను సందర్శించిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరిలో నేపాలీ జాతీయుడు కూడా ఉన్నారు. ఇందులో 26 మంది మరణించారు.

 

ఉగ్రవాదులు ఇస్లాంలోని కల్మాలను చదవమని అడిగి, చదవని వారిని ముస్లింలు కాదని నిర్ణయించుకున్నాక వారిని పాయింట్ – బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను శిక్షించేదాక వదలమన్నారు ప్రధాని మోదీ. పాకిస్థాతో ఉన్న అన్ని దౌత్యసంబంధాలను నిలిపివేశారు. సింధూ జలాలను ఆఫివేయడం, వీసాలను నిలిపివేయడం, దిగుమతులను నిషేధించడం జరిగింది. దీంతో పాకిస్థాన్ ఆర్థికంగా కుదేలైంది.

 

భారత్ తో కనుక పాకిస్థాన్ యుద్దం చేస్తే దాని వద్ద కేవలం నాలుగు రోజులకు సరిపడా ముద్ధ సామాగ్రి ఉంది. ట్యాంకులలో డీజిల్ కూడా లేని పరిస్థితులలో పాక్ ఉంది. ఆయుధాలకోసం చైనా వద్ద చేయిచాచింది.