Published On:

IPL 2025: నేడు చెన్నైతో కీలక మ్యాచ్.. గెలిస్తేనే కోల్‌కతా జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు!

IPL 2025: నేడు చెన్నైతో కీలక మ్యాచ్.. గెలిస్తేనే కోల్‌కతా జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు!

Chennai Super Kings vs Kolkata Knight Riders in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాల 57వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా జట్టుకు కీలకం కానుంది.

 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా.. మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకుంది. అయితే కోల్‌కతా జట్టు 11 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లలో ఓడింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క పాయింట్ వచ్చింది. పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.

 

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ కోల్‌కతా జట్టుకు కీలకం కానుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 5 విజయాలతో 6వ స్థానంలో ఉంది. మిగతా 3 మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందితే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒకవేళ చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.