Published On:

Amaravati: ఏపీకి ప్రధాని మోదీ: పోలీసుల వలయంలో గన్నవరం

Amaravati: ఏపీకి ప్రధాని మోదీ: పోలీసుల వలయంలో గన్నవరం

Amaravati:  ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 సెక్టార్లుగా విభజించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అమరావతికి రోడ్డుమార్గంలో వెళ్లనున్నారు.

 

గన్నవరం నుంచి అమరావతి రోడ్డు మార్గంలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజధాని కల సాకారం కాబోతున్న తరుణంలో అమరావతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని రాక సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

 

 

ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని.. ఐదేళ్ల పాటు పండుగంటే ఏంటో తెలియకుండా గడిపామని రాజధాని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా అలుపెరగని పోరాటం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకష్టాలు తీరిపోయాయని రైతులు అంటున్నారు.