Last Updated:

ED : టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసు.. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది.

ED : టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసు.. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ED: పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యకు చెందిన 7 కోట్ల 93 లక్షల ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో 61 ఖాతాల్లోని బ్యాంకు బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.

అటాచ్ చేసిన బ్యాంకు ఖాతాల్లో కొన్ని ఎమ్మెల్యే స్నేహితులు, బంధువుల పేర్లపై ఉన్నాయి. చట్టం కళ్లు గప్పి తప్పించుకునేందుకు మణిక్, ఆయన కుటుంబ సభ్యులు వారితో బలవంతంగా ఖాతాలు తెరిపించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఓ ఖాతా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఆ ఖాతా మాణిక్ భట్టాచార్య భార్య శాతరూప భట్టాచార్య, 2016లో మృతి చెందిన మృత్యుంజయ భట్టాచార్య పేరుపై ఉన్నట్టు అధికారులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్య బోర్డు మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన మాణిక్ భట్టాచార్యను అక్టోబరు 10న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అలాగే, ఈ కేసులో ఈడీ ఇప్పటికే 49కోట్ల 80 లక్షల నగదు, ఐదు కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు, అలాగే 48కోట్ల 22 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన సొమ్ముతో కలిపి ఈడీ ఇప్పటి వరకు 111 కోట్లను ఆస్తులను జప్తు చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి: