Published On:

Virat Kohli – Anushka Sharma: మూడోసారి ప్రేమానంద్‌ను దర్శించుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!

Virat Kohli – Anushka Sharma: మూడోసారి ప్రేమానంద్‌ను దర్శించుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!

Virat Kohli and Anushka Sharma Visited Premanand Maharaj: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన సతీమణి, బాలీవుడ్ యాక్టర్ అనుష్క శర్మతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉన్న ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను దర్శించుకున్నారు. వీరిద్దరూ జంటగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు.

 

అయితే, విరాట్, అనుష్క దంపతులు వరుసగా ప్రేమానంద్‌ను దర్శించుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇటీవల పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఈ జంట సాధువుతో మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ప్రేమానంద్ ఒకరు.

 

టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ వెళ్లిన తొలి వ్యక్తిగా కార్యక్రమం ఇదే కావడం విశేషం. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

అంతకుముందు, 2023 జనవరిలో విరాట్, అనుష్క శర్మలు ప్రేమానంద్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2025 జనవరిలో మరోసారి సందర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిద్దరూ వెళ్లి ఆ గురువు ఎదుట సాష్టాంగ ప్రణామం చేశారు. ఆ సమయంలో ఆ వీడియో వైరల్ అయింది.

 

తాజాగా, మూడోసారి ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాతిరోజే ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. ఈ వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

 

ఇక, క్రికెట్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. నిన్న టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తర్వాత కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నాడు.