Published On:

IPL 2025 Re-schedule: ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన.. మ్యాచ్‌లు ఎక్కడంటే..?

IPL 2025 Re-schedule: ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన.. మ్యాచ్‌లు ఎక్కడంటే..?

IPL 2025 Announced Re Schedule: భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ మధ్యలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2025కు సంబంధించి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 17 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది.

 

ఇందులో భాగంగానే, ఐపీఎల్ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 13 లీగ్ మ్యాచ్‌లు సహా మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.

 

ఇక, ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు మొత్తం ఆరు స్టేడియాల్లోనే జరగనున్నాయి. మొత్తం 17 మ్యాచ్‌లు ఇక్కడే జరిగే అవకాశం ఉంది. తర్వాత మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది స్పష్టం చేసింది.

 

మే 17వ తేదీన బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మే 18న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుండగా.. రెండో మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఆడనున్నాయి.

 

అలాగే, మే 19న లక్నో వేదికగా లక్నో, హైదరాబాద్ తలపడనుండగా.. మే 20న ఢిల్లో వేదికగా రాజస్థాన్, చెన్నై… మే 21న ముంబై వేదికగా ముంబై వర్సెస్ ఢిల్లీ, మే 22న అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ లక్నో జట్లు తలపడనున్నాయి. ఇక, మే 23న బెంగళూరు వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

 

మే 24వ తేదీన జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. మే 25వ తేదీన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, చెన్నై జట్లు తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా హైదరాబాద్, కోల్‌కతా ఆడనున్నాయి. మే 26వ తేదీన జైపూర్ వేదికగా పంజాబ్, ముంబై జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇక, చివరగా మే 27న లక్నో వేదికగా బెంగళూరు, లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.