Published On:

YOGA Day: విశాఖలో ఇంటర్నేషనల్ యోగా డే.. సీఎం చంద్రబాబు రివ్యూ

YOGA Day: విశాఖలో ఇంటర్నేషనల్ యోగా డే.. సీఎం చంద్రబాబు రివ్యూ

CM Chandrababu: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డేపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాని వస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో అభ్యాసానికి ఇది నాంది కావాలన్నారు. కాగా “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” ను ఈ ఏడాది యోగా డే థీమ్ గా తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ యోగా డే లో భాగస్వాములను చేయాలని.. కనీసం 2 కోట్ల మందికి కార్యక్రమం చేరాలన్నారు. యోగాంధ్ర- 2025 థీమ్ తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని.. అందుకోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు మే21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ చేయాలని.. అందుకు ప్రైవేట్ వ్యక్తులు, యోగా అసోసియేషన్లు, నిపుణులు, శిక్షకులను కలుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులను కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.

 

విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డే వేడుకలు, ప్రధాని పాల్గొనే వేదిక, నిర్వహణపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సుమారు రెండున్నర లక్షల మంది అందులో పాల్గొంటారని అధికారులు వివరించారు. యోగా నిర్వహించేందుకు 68 ప్రాంతాలు గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూళ్లు, క్రికెట్, పోలీస్, స్పోర్ట్స్, నావీ గ్రౌండ్స్, ఖాళీ స్థలాల్లో యోగా నిర్వహించనున్నట్టు తెలిపారు. యోగా డే ప్రారంభమై 10 ఏళ్లు పూరైన సందర్భంగా ప్రధాని పాల్గొంటున్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు.