Home / West Bengal
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.
పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్లోని దత్తపుకూర్లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఆరుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్శిటీకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీల్గంజ్లోని మోష్పోల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ శనివారం ఆరోపించింది. మే 4 మణిపూర్ వీడియోపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వచ్చింది.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అయ్యింది. రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది.
పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్లోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రూప్ డి మరియు గ్రూప్ సి సేవల కింద ఉన్న ఉద్యోగాలకు రేటు పెట్టి అమ్ముకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడయింది.
టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్పై దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.. రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు సీబీఐ నిఘాలో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో సాగర్డిఘి అసెంబ్లీ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మూడు నెలల ఊహాగానాల తర్వాత, పుర్బా మేదినీపూర్లోని ఘటోలాలో సోమవారం జరిగిన వేడుకలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు