Published On:

Samantha: సమంత-రాజ్‌ ప్రయాణం మొదలైంది – వారిద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: నటి మధుమణి

Samantha: సమంత-రాజ్‌ ప్రయాణం మొదలైంది – వారిద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: నటి మధుమణి

Subham Actress Comments on Samantha and Raj Nidimoru: సమంత నిర్మాణంలో వచ్చిన శుభం మూవీ మంచి విజయం సాధించింది. కామెడీ, హారర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 9న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో మూవీ టీం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ని జరుపుకుటుంది. తాజాగా మూవీ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుభం నటినటులు, దర్శకుడు, నిర్మాత సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు ‘శుభం’ టీం ధన్యవాదాలు తెలిపింది.

 

ఈ నేపథ్యంలో ఇందులో తల్లి పాత్రలో నటించిన నటి మధుమణి.. సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దర్శకుడు రాజ్‌ నిడిమోరు-సమంతలపై ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. “39 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. 400లకు పైగా సినిమాలు చేశాను. కానీ, సమంత కలిసి నటించే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. రంగస్థలంలో ఆమెకు అమ్మగా నటించే అవకాశం చేజారింది. మంచి అవకాశం మిస్‌ అయ్యాననే బాధ నాకెప్పుడు ఉండేది. ఇక శుభం సినిమా కోసం మూవీ టీం నన్ను సంప్రదించినప్పుడు ఎంతో సంతోషించా. ఒక్క రోజు షూట్‌ మిస్‌ చేయగానే అనారోగ్యం బారిన పడ్డాను. చికెన్‌ గున్యాతో ఇబ్బంది పడ్డాను. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్నా.

 

ఈ సినిమా మిస్‌ అవుతాననే బాధ ఉండేది. కానీ నాలుగు నెల తర్వాత మళ్లీ శుభంతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఆరు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తున్నా. ఈ సినిమా చూసి తెలిసిన వారందరూ మెచ్చుకుంటూ నాకు సందేశాలు పంపుతున్నారు. ఈ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్‌కు ‘శుభం’. రాజ్‌, మీరు శుభంతో ఈ ప్రయాణం మొదలుపెట్టాతరు. ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి. శతమానం భవతి’ అంటూ ఆమె కామెంట్స్‌ చేశారు. సమంత, రాజ్‌ నిడిమోరు డేటింగ్ రూమర్స్‌ వేళ నటి మధుమణి చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.