Home / ED Raids
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. పొన్ముడి తనయుడు, లోక్సభ ఎంపీ గౌతం సిగమణిపై కూడా సోదాలు జరుగుతున్నాయి
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశాడని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులుప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
బొగ్గు లెవీ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్గఢ్లోని 14 ప్రాంతాల్లో సోమవారం ఉదయం సోదాలు ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది.
కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది.