Last Updated:

CBI raids RJD leaders in Bihar: బీహార్‌లో ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు

బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.

CBI raids RJD leaders in Bihar: బీహార్‌లో ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు

Bihar: బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది. ఆర్జేడీ నేతలు సుబోధ్ రాయ్, అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్‌లపై కూడా సీబీఐ దాడులు చేసింది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలపై కూడా సోదాలు జరుపుతోంది. మరోవైపు ఈ సోదాలు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారు. ఇందులో అర్థం లేదని, భయంతో ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా వస్తారని భావించి ఇలా చేస్తున్నారని సునీల్ సింగ్ అన్నారు.

ఈ దాడులపై ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ, ఇది ఈడీ లేదా ఐటీ లేదా సీబీఐ దాడులు అని చెప్పడం వేస్ట్. ఇది బీజేపీ చేసిన దాడి. వారు ఇప్పుడు బీజేపీ క్రింద పని చేస్తున్నారు, వారి కార్యాలయాలు బీజేపీ స్క్రిప్ట్‌తో నడుస్తున్నాయి. ఈ రోజు బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఇక్కడ ఏమి జరుగుతోంది. మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం నడవదు. ప్రజా సంక్షేమం కోసమే కూటమిని మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ యాదవ్, వారి కూతుళ్లు మీసా యాదవ్, హేమ యాదవ్‌లతో పాటు కొంతమంది అనర్హులు, భూమికి బదులుగా ఉద్యోగాలు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ నిందితులుగా పేర్కొని ఈ సంవత్సరం మేలో కేసు నమోదు చేసింది. 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ భూస్వామ్య (యజమాని అసలు చేయనవసరం లేకుండా యజమానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తి) బదిలీ రూపంలో ఆర్థిక ప్రయోజనాలను పొందారని సీబీఐ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి: