Published On:

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్

8 People Dead in Bihar Road Accident: బీహార్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కటిహార్ జిల్లాలోని పోతియా సమీపంలో జరిగింది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపాల్ ప్రాంతానికి చెందిన కొంతమంది పెళ్లి వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 31పై పోతియా సమీపంలోని సమేలి బ్లాక్ ఆఫీసు వద్ద ఎదురుగా ట్రక్కు వచ్చింది. ఈ సమయంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఎనిమిది మంది చనిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.

 

స్థానికులు వెంటనే సమాచారం అందించగా.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. క్షతగాత్రులను స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

 

ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.