Published On:

TGPSC Vs BRS : బీఆర్‌ఎస్ నేత రాకేష్‌ రెడ్డికి పరువునష్టం దావా నోటీసులు

TGPSC Vs BRS : బీఆర్‌ఎస్ నేత రాకేష్‌ రెడ్డికి పరువునష్టం దావా నోటీసులు

TGPSC Vs BRS : బీఆర్‌ఎస్ పార్టీ నేత ఏనుగుల రాకేష్‌‌రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. వారంరోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వారంరోజుల్లో సమాధానం చెప్పకపోతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. తదుపరి టీజీపీఎస్సీపై రాకేష్‌రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు విధించింది.

 

పేపర్లను రీ వాల్యుయేషన్ చేయాలి : రాకేష్ రెడ్డి
గ్రూప్-1 మెయిన్స్‌‌లోని అన్ని పేపర్లను రీ వాల్యుయేషన్ చేయాలని రాకేష్ రెడ్డి అన్నారు. వాల్యుయేషన్‌లో జరిగిన తప్పిదాలను సర్కారు సరిద్దాలని రాకేష్ ఇటీవల పెట్టిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. గ్రూప్-1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్-1 మెయిన్స్ రాసిన వారిలో 40 శాతం తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని, కానీ వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో రాలేదని తెలిపారు. మెయిన్స్ పరీక్షలను 45 కేంద్రాల్లో నిర్వహిస్తే రెండు కేంద్రాల్లో 72 మంది ఎలా ట్యాప్‌ ర్యాంకులో నిలిచారో టీజీపీఎస్సీ చెప్పాలన్నారు. టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియాన్ని చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.

 

18, 19వ కేంద్రాల్లో అవకతవలు..
18, 19వ కేంద్రాల్లో అవకతవలు జరిగాయనే అనుమానం ఉందన్నారు. ఏపీపీఎస్సీలో 6 వేల పేపర్లను దిద్దేందుకు 40 రోజుల సమయం తీసుకుంటే, ఇప్పుడు 20 వేల పేపర్లను తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా ఉందంటూ రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలపై టీజీపీఎస్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలపై సమాధానం చెప్పాలని రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.

 

 

ఇవి కూడా చదవండి: