CM Revanth Reddy : కోటి మంది మహిళను కోటీశ్వరులను చేస్తాం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

CM Revanth Reddy : మహిళలే దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటిమంది మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చామని తెలిపారు. రూ.5,200 కోట్లను మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చామన్నారు. ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.
ఆడబిడ్దలకు రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించామని పేర్కొన్నారు. ఈ నెల 21 ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చే ప్రతి రుపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నామని తెలిపారు.